విద్యుత్ షాక్తో టెన్త్ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2022-09-01T14:31:28+05:30 IST
జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగంపల్లి గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో పదవ తరగతి విద్యార్థి
Sangareddy: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగంపల్లి గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్(Electric shock)తో పదవ తరగతి విద్యార్థి (10th class student)మృతి చెందాడు. వినాయక మండపం ఏర్పాటుచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతి చెందాడని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. విద్యార్థి మృతిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. చనిపోయిన విద్యార్థి మెదక్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.