India-Pak Tests: భారత్‌-పాక్‌ టెస్టులకు ఆతిథ్యమిస్తాం..

ABN , First Publish Date - 2022-12-30T00:09:14+05:30 IST

టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు దక్కిన ఆదరణతో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.

 India-Pak Tests: భారత్‌-పాక్‌ టెస్టులకు ఆతిథ్యమిస్తాం..

మెల్‌బోర్న్‌: టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు దక్కిన ఆదరణతో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు తాము ఆతిథ్యమిస్తామని ప్రకటించింది. ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానాన్ని ఈ క్లబ్‌ పర్యవేక్షిస్తుంటుంది. ఎంసీజీలోనే జరిగిన దాయా దుల మెగా టోర్నీ టీ20 మ్యాచ్‌ను 90 వేలకు పైగా ప్రేక్షకులు తిలకించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-30T00:09:15+05:30 IST