టీమిండియా ప్రాక్టీస్ షురూ
ABN , First Publish Date - 2022-08-16T10:11:28+05:30 IST
జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా మూడు వన్డేల సిరీస్ కోసం సన్నాహకాలు ఆరంభించింది.

హరారే: జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా మూడు వన్డేల సిరీస్ కోసం సన్నాహకాలు ఆరంభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆటగాళ్లంతా నెట్ ప్రాక్టీస్ చేశారు. పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్ నెట్స్లో బౌలింగ్ చేయగా.. గిల్, రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు ఈనెల 18న తొలి వన్డే ఆడనుంది.