తన్మయ్కే రంజీ పగ్గాలు
ABN , First Publish Date - 2022-12-10T01:52:33+05:30 IST
ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభమవనున్న 2022-23 రంజీ సీజన్లో పాల్గొనే 20మంది సభ్యుల హైదరాబాద్ జట్టును శుక్రవారం ప్రకటించారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభమవనున్న 2022-23 రంజీ సీజన్లో పాల్గొనే 20మంది సభ్యుల హైదరాబాద్ జట్టును శుక్రవారం ప్రకటించారు. కెప్టెన్గా తన్మయ్ అగర్వాల్ నియమితుడయ్యాడు. వచ్చే మంగళవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న తమ తొలి మ్యాచ్లో గ్రూప్-బిలో ఉన్న హైదరాబాద్, తమిళనాడుతో తలపడనుంది.