బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాకు సుచిరిండియా చేయూత.. లక్ష రూపాయల అందజేత

ABN , First Publish Date - 2022-01-02T01:01:30+05:30 IST

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాకు సుచిరిండియా చేయూత అందించింది. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాకు సుచిరిండియా చేయూత.. లక్ష రూపాయల అందజేత

హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరా మోపటికి సుచిరిండియా చేయూత అందించింది. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన సాయం అందించడంలో ముందుండే ఆ సంస్థ సీఎండీ లయన్ కిరణ్ కుమార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో ఆమెకు రూ. లక్ష చెక్కు అందించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహిస్తే వారు దేశానికి గుర్తింపు తీసుకొస్తారని అన్నారు. తాము గత 15 ఏళ్లుగా  క్రికెట్ సహా అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తున్నామని, వారికి అవసరమైన సామాజిక, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. కెయూరాకు మున్ముందు కూడా అవసరమైన సాయాన్ని అందిస్తామన్నారు. 


కెయూరా మాట్లాడుతూ.. ఆలిండియా కేటగిరీలో 12వ ర్యాంకు, అంతర్జాతీయ స్థాయిలో 240 ర్యాంకులో ఉన్న తాను ఇటీవల జరిగిన ఐరిష్ ఓపెన్ చాలెంజ్‌లో కాంస్య పతకం సాధించినట్టు తెలిపింది. ఈ నెలలో ఇండియా ఓపెన్‌తోపాటు మరో రెండు టోర్నీల్లో పాల్గొంటున్నట్టు చెప్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగానే తాను ఈ స్థాయికి చేరుకోగలిగినట్టు పేర్కొంది. తన కోసం తండ్రి తన ఉద్యోగాన్ని కూడా త్యాగం చేశారని పేర్కొన్న కెయూరా.. దేశం కోసం పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సుచిరిండియా అందిస్తున్న సాయానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-01-02T01:01:30+05:30 IST