దంచికొడుతున్న పృథ్వీషా.. అర్ధశతకం పూర్తి
ABN , First Publish Date - 2022-04-08T01:44:19+05:30 IST
లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా బ్యాట్తో చెలరేగిపోతున్నాడు.
ముంబై: లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా బ్యాట్తో చెలరేగాడు. 30 బంతుల్లోనే 8 ఫోర్లు, సిక్సర్తో (50) అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఐపీఎల్లో అతడికిది 11వ అర్ధ సెంచరీ. క్రీజులోకి దిగింది మొదలు స్ట్రైకింగ్ తనవద్దే ఉంచుకుంటూ వచ్చిన షా దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి తరలించాడు.
అర్ధ సెంచరీ తర్వాత మరింత జోరు పెంచిన షా మరో సిక్సర్, ఫోర్ బాదాడు. ఈ క్రమంలో గౌతమ్ బౌలింగులో మరో భారీ షాట్కు యత్నించి డికాక్కు దొరికిపోయాడు. మొత్తంగా 34 బంతులు ఆడిన షా 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ప్రస్తుతం 8 ఓవర్లు పూర్తయ్యాయి. ఢిల్లీ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. వార్నర్ (4), రోవ్మన్ పావెల్ క్రీజులో ఉన్నారు.