రెండు ఓవర్లలో రెండు వికెట్లు డౌన్.. మళ్లీ నిరాశపరిచిన మయాంక్

ABN , First Publish Date - 2022-04-04T01:16:45+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మరోమారు

రెండు ఓవర్లలో రెండు వికెట్లు డౌన్.. మళ్లీ నిరాశపరిచిన మయాంక్

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మరోమారు దారుణంగా నిరాశపరిచాడు. తొలి ఓవర్ రెండో బంతికే పెవిలియన్ చేరాడు. ముకేశ్ చౌదరి బౌలింగులో కవర్ పాయింట్‌లో ఊతప్పకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండు బంతులు మాత్రమే ఆడిన మయాంక్ నాలుగు పరుగులు చేశాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులు చేసిన మయాంక్.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇప్పుడు నాలుగు పరుగులకే అవుటయ్యాడు.


ఇక, రెండో ఓవర్ రెండో బంతికి పంజాబ్ మరో వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో చితక్కొట్టిన భానుక రాజపక్స ఈసారి 9 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. ఫలితంగా 14 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయిన పంజాబ్ ఒత్తిడిలోకి జారుకుంది. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిశాయి. పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, లియామ్ లివింగ్ స్టోన్ క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-04-04T01:16:45+05:30 IST