టీనేజ్లోనే IPL లో సంచలనాలు సృష్టించిన ఆటగాళ్లు వీరే
ABN , First Publish Date - 2022-05-15T23:51:12+05:30 IST
ముంబై : IPL అంటేనే యువ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఐపీఎల్లో ఆడి సెలక్టర్ల దృష్టిలోపడ్డ నేటితరం క్రికెటర్లు ఎందరో ఉన్నారు.
ముంబై : IPL అంటేనే యువ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఐపీఎల్లో ఆడి సెలక్టర్ల దృష్టిలోపడ్డ నేటితరం క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా కొందరు బ్యాట్స్మెన్ టీనేజ్లోనే ఉండగానే ఐపీఎల్లో అదరగొట్టారు. 20 ఏళ్లు నిండకుండానే పరుగుల సునామీ సృష్టించారు. అలాంటి కొందరు క్రికెటర్లు ఎవరు, ఏ సీజన్లో రాణించారో ఓ లుక్కేద్దాం..
IPL2022లో కొందరు టీనేజర్లు తమ బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నారు. అంచనాలు లేకుండానే బరిలోకి దిగి అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ ఈ సీజన్లో ఇప్పటివరకు 368 పరుగులు చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్తో శెభాష్ అనిపించుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ ఓటములతో కుంగిపోతున్నా ఎంతో చక్కగా రాణిస్తూ ఆకట్టుకున్నాడు. కాగా 2019 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పృధ్వీ షా విశేషంగా రాణించాడు. ఏకంగా 353 పరుగులు సాధించి అబ్బురపరిచాడు.
ఇక మైదానంలో చాలా ప్రశాంతంగా కనిపించే సంజూ శాంసన్ 2014 ఐపీఎల్లో ఇరగదీశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆ సీజన్లో 339 పరుగులు నమోదు చేశాడు. ఆ సీజన్లో జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించి సెలక్టర్ల దృష్టిలోపడ్డాడు. మరో డాషింగ్ బ్యాట్స్మెన్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 2017 సీజన్లో అదరగొట్టాడు. ఆ ఏడాది ఢిల్లీ డేర్డెవిల్స్ తరపున ఆడి ఏకంగా 366 పరులు చేశాడు. మాజీ క్రికెటర్లు సైతం ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జాతీయ జట్టులో చోటుదక్కించుకున్న విషయం తెలిసిందే.