సాయికార్తీక్కు ఐటీఎఫ్ టైటిల్
ABN , First Publish Date - 2022-09-19T09:33:26+05:30 IST
ఐటీఎఫ్ పురుషుల డబుల్స్ టైటిల్ను హైదరాబాద్కు చెందిన గంటా సాయికార్తీక్ రెడ్డి-పరిక్షిత్ (అసోం) జోడీ కైవసం చేసుకుంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐటీఎఫ్ పురుషుల డబుల్స్ టైటిల్ను హైదరాబాద్కు చెందిన గంటా సాయికార్తీక్ రెడ్డి-పరిక్షిత్ (అసోం) జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం ట్యునీసియాలో జరిగిన ఫైనల్లో సాయికార్తీక్ ద్వయం 6-3, 6-4తో సన్ క్యూ-టాంగ్ ఎస్ (చైనా)పై నెగ్గి విజేతగా నిలిచింది.