షూటౌట్‌లో భారత్‌ గెలుపు

ABN , First Publish Date - 2022-04-03T09:43:08+05:30 IST

భారత హాకీ పురుషుల జట్టు ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో ఇంగ్లండ్‌పై గెలిచింది.

షూటౌట్‌లో భారత్‌ గెలుపు

ఇంగ్లండ్‌తో ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌

భువనేశ్వర్‌: భారత హాకీ పురుషుల జట్టు ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో ఇంగ్లండ్‌పై గెలిచింది. ఇక్కడి కళింగ స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ షూటౌట్‌లో 3-2తో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 3-3 గోల్స్‌తో సమంగా నిలిచాయి. దీంతో అనివార్యమైన షూటౌట్‌లో భారత్‌ ఒక్క గోల్‌ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌తోనే తన రెండో మ్యాచ్‌ను భారత్‌ ఆదివారం ఆడనుంది. 

Updated Date - 2022-04-03T09:43:08+05:30 IST