England vs India: లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన భారత్
ABN , First Publish Date - 2022-07-01T22:35:23+05:30 IST
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్ మ్యాచ్)లో భారత జట్టు లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు
బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్ మ్యాచ్)లో భారత జట్టు లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 53 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా దారుణంగా విఫలమయ్యారు. 27 పరుగుల వద్ద గిల్ (17) అవుట్ కాగా, 46 పరుగుల వద్ద పుజారా (13) వెనుదిరిగాడు. వీరిద్దరూ జేమ్స్ అండర్సన్ బౌలింగులో జాక్ క్రాలీకే క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం గమనార్హం. ప్రస్తుతం హనుమ విహారి (14), విరాట్ కోహ్లీ (1) క్రీజులో ఉన్నారు.