టీమిండియాకు భారీ జరిమానా

ABN , First Publish Date - 2022-12-06T00:55:24+05:30 IST

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌కు భారత జట్టు భారీగానే మూల్యం చెల్లించుకుంది. ఆటగాళ్ల మ్యాచ్‌ రుసుములో 80 శాతం జరిమానా విధిస్తూ

టీమిండియాకు భారీ జరిమానా

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌కు భారత జట్టు భారీగానే మూల్యం చెల్లించుకుంది. ఆటగాళ్ల మ్యాచ్‌ రుసుములో 80 శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్‌ రెఫరీ రంజన్‌ మదుగలే నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణీత సమయానికి టీమిండియా 4 ఓవర్లు తక్కువగా వేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన వికెట్‌ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-12-06T00:55:25+05:30 IST