ముగిసిన చెన్నై ఇన్నింగ్స్.. టైటాన్స్ ఎదుట స్వల్ప లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-15T23:08:24+05:30 IST
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
ముంబై: గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్లో మరోమారు తేలిపోయిన చెన్నై చేతిలో పుష్కలంగా వికెట్లు ఉన్నప్పటికీ పరుగులు రాబట్టడంలో విఫలమైంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అర్ధ సెంచరీ (53)తో టాప్ స్కోరర్గా నిలిచాడు. మొయిన్ అలీ 21, జగదీశన్ 39 పరుగులు చేశారు. దూబే డకౌట్ కాగా, ధోనీ (7) మరోమారు దారుణంగా నిరాశపరిచాడు.