పంజాబ్కు బ్యాటింగ్ అప్పగించిన గుజరాత్ టైటాన్స్
ABN , First Publish Date - 2022-04-09T00:40:54+05:30 IST
పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన గుజరాత్
ముంబై: పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పంజాబ్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు రెండింటిలో విజయం సాధించగా, గుజరాత్ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి జోరు మీద ఉంది. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సీజన్లో పెద్దగా అంచనాలు లేని పంజాబ్ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ విజయాలు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి పోరు ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.
గుజరాత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. విజయ్, వరణ్ స్థానంలో సాయి సుదర్శన్, దర్శన్ జట్టులోకి వచ్చారు. వీరిద్దరికీ ఇదే ఐపీఎల్లో ఇదే తొలి మ్యాచ్. పంజాబ్ కింగ్స్ మాత్రం ఒకే ఒక్క మార్పు చేసింది. రాజపక్స స్థానంలో బెయిర్స్టో జట్టులోకి వచ్చాడు.