బీసీసీఐ మాజీ కార్యదర్శి అమితాబ్ చౌధురి హఠాన్మరణం
ABN , First Publish Date - 2022-08-17T10:08:30+05:30 IST
బీసీసీఐ మాజీ కార్యదర్శి, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌధురి.
రాంచీ: బీసీసీఐ మాజీ కార్యదర్శి, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌధురి (62).. మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన అమితాబ్.. జార్ఖండ్ జట్టుకు ఫస్ట్ క్లాస్ హోదా తీసుకురావడానికి విశేషంగా కృషి చేశాడు. 2005లో గంగూలీ-చాపెల్ వివాద సమయంలో భారత జట్టు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా అమితాబ్ వ్యవహరించాడు. బీసీసీఐలో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) హయంలో తాత్కాలిక కార్యదర్శిగా కూడా సేవలందించాడు. కుంబ్లే-కోహ్లీ ఎపిసోడ్లోనూ అమితాబ్ సాక్షిగా నిలిచాడు. కాగా, అమితాబ్ హఠాన్మరణం తనను షాక్కు గురి చేసిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. జార్ఖండ్ క్రికెట్ రూపురేఖలు మార్చడంలో చౌధురిది కీలకపాత్ర అని బోర్డు కార్యదర్శి జై షా తెలిపాడు.