ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం 260 పరుగులు
ABN , First Publish Date - 2022-07-18T00:57:38+05:30 IST
భారత్తో ఇక్కడ ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరుగుతున్న సిరీస్ నిర్ణాయక మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 45.5 ఓవర్లలో
మాంచెస్టర్: భారత్తో ఇక్కడి ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరుగుతున్న సిరీస్ నిర్ణాయక మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 45.5 ఓవర్లలో 259 పరుగులు మాత్రమే చేసి భారత్కు 260 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బకొట్టినప్పటికీ కెప్టెన్ జోస్ బట్లర్ సమయోచిత ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ 259 పరుగుల కాపాడుకోగలిగే స్కోరు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ 41, బెన్స్టోక్స్ 27, మొయిన్ అలీ 34, లివింగ్స్టోన్ 27 పరుగులు చేయగా, చివర్లో డేవిడ్ విల్లీ (18), క్రెయిగ్ ఒవెర్టన్ (32) జట్టును మరోమారు తమ భుజాలపై మోశారు. ఫలితంగా జట్టు స్కోరు 250 పరుగులు దాటింది.
భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా అద్భుత స్పెల్తో అదరగొట్టాడు. 7 ఓవర్లు వేసి మూడు మెయిడెన్లతో 24 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ రెండు, చాహల్ మూడు వికెట్లు పడగొట్టారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.