ఐపీఎల్లో అరుదైన రికార్డు సాధించిన భువీ.. జహీర్ఖాన్ రికార్డు బద్దలు
ABN , First Publish Date - 2022-04-18T00:06:04+05:30 IST
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు సాధించాడు.
ముంబై: పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు సాధించాడు. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు నేలకూల్చిన బౌలర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో జహీర్ఖాన్, సందీప్ శర్మలను అధిగమించాడు. శిఖర్ ధవన్ వికెట్ను నేలకూల్చిన భువీ తన పేరును రికార్డు పుస్తకాల్లోకి ఎక్కించుకున్నాడు.
కుమార్ ఇప్పుడు 53 వికెట్లతో పవర్ప్లేలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో జహీర్ఖాన్, సందీప్ శర్మ ఉన్నారు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లు వేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు నేలకూల్చాడు.