బైజూస్తో జెర్సీ స్పాన్సర్షిప్ను మరో ఏడాది పొడిగించిన బీసీసీఐ
ABN , First Publish Date - 2022-03-07T23:51:38+05:30 IST
జెర్సీ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో దానిని మరో ఏడాదిపాటు పొడిగించాలని బీసీసీఐ-బైజూస్ నిర్ణయించాయి
న్యూఢిల్లీ: జెర్సీ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో దానిని మరో ఏడాదిపాటు పొడిగించాలని బీసీసీఐ-బైజూస్ నిర్ణయించాయి. బెంగళూరుకు చెందిన ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ అయిన బైజూస్ గతంలో బీసీసీఐతో కుదుర్చుకున్న ఒప్పందం శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ తర్వాత ముగియనుంది.
ఈ నేపథ్యంలో జెర్సీ స్పాన్సర్షిప్ను మరో ఏడాదిపాటు పొడిగించేందుకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 2019 వరకు భారత జట్టు జెర్సీ స్పాన్సర్గా చైనీస్ మొబైల్ బ్రాండ్ ఒప్పో వ్యవహరించింది. ఆ తర్వాతి నుంచి బైజూస్ జెర్సీ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. జెర్సీ స్పాన్సర్షిప్ను దక్కించుకున్న బైజూస్ ద్వైపాక్షిక సిరీస్కు రూ. 4.61 కోట్లు, అంతర్జాతీయ మ్యాచ్లకు రూ. 1.56 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది.