Bangladesh - India first test: శ్రేయాస్ సెంచరీ మిస్..

ABN , First Publish Date - 2022-12-15T11:43:11+05:30 IST

బంగ్లాదేశ్ - ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్ నైట్

Bangladesh - India first test: శ్రేయాస్ సెంచరీ మిస్..

చిట్టగాంగ్‌: బంగ్లాదేశ్ - ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు (Bangladesh - India first test)రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 278/6 తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆట ఆరంభంలోనే సెంచరీకి చేరువలో ఉన్న అయ్యర్ (86) వద్ద ఔటయ్యాడు. దీంతో నిన్న పుజారా, నేడు శ్రేయాస్ అయ్యర్ సెంచరీ కూడా మిస్సైంది. ఎబాడట్ బౌలింగ్ లో 97.6వ ఓవర్‎లో శ్రేయాస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అయ్యర్ సెంచరీ చేస్తాడనుకున్న అభిమానుల ఆశలను నిరాశపరిచాడు. ఏడో వికెట్ ను భారత్ 293 పరుగుల వద్ద కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్, (40), కుల్‎దీప్ యాదవ్ (21) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. అయితే..ఎనిమిదవ వికెట్‎కు అశ్విన్, కుల్దీప్ యాదవ్ 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజు లంచ్ సమయానికి భారత్ స్కోర్ 120 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 348 రన్స్ చేసింది.

Updated Date - 2022-12-15T11:46:10+05:30 IST