అథ్లెట్ పూవమ్మపై రెండేళ్ల నిషేధం
ABN , First Publish Date - 2022-09-20T09:34:52+05:30 IST
భారత సీనియర్ అథ్లెట్, ఆసియా క్రీడల పతక విజేత ఎమ్ఆర్ పూవమ్మపై వేటు పడింది. గతేడాది డోప్ పరీక్షలో విఫలమైన ఈ కర్ణాటక అథ్లెట్పై రెండేళ్ల నిషేధం విధించారు.
న్యూఢిల్లీ: భారత సీనియర్ అథ్లెట్, ఆసియా క్రీడల పతక విజేత ఎమ్ఆర్ పూవమ్మపై వేటు పడింది. గతేడాది డోప్ పరీక్షలో విఫలమైన ఈ కర్ణాటక అథ్లెట్పై రెండేళ్ల నిషేధం విధించారు. 32 ఏళ్ల పూవమ్మ గతేడాది ఫిబ్రవరిలో ఇండియా గ్రాండ్ ప్రీ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్లు రుజువైంది. దీంతో డోపింగ్ వ్యతిరేక క్రమశిక్షణ ప్యానెల్ ఈ జూన్లో పూవమ్మపై కేవలం మూడు నెలల సస్పెన్షన్ మాత్రమే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్యానెల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డోపింగ్ నిరోధక అప్పీల్ ప్యానెల్ (ఏడీఏపీ)కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అప్పీలు చేసింది. దీంతో ఏడీపీఏ పూవమ్మపై రెండు నెలల నిషేధాన్ని విధించాలని ఆదేశాలు జారీ చేసింది. 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన భారత మహిళల 4.400 మీటర్ల రిలే, మిక్స్డ్ రిలే జట్లలో పూవమ్మ సభ్యురాలు. 2012 ఆసియా క్రీడల మహిళల 400 మీటర్లలో పూవమ్మ కాంస్యం గెలుచుకుంది. 2015లో ఆమె అర్జున అవార్డు కూడా అందుకుంది.