రోహిత్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ ?

ABN , First Publish Date - 2022-12-09T00:49:50+05:30 IST

బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీ్‌సలో కెప్టెన్‌ రోహిత్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకునే అవకాశం ఉంది.

రోహిత్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ ?

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీ్‌సలో కెప్టెన్‌ రోహిత్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగ్లా పర్యటనలోనే ఉన్న భారత్‌ ‘ఎ’ జట్టుకు ఓపెనర్‌గా 2 వరుస సెంచరీలు సాధించడంతో సెలెక్టర్లు అతడి వైపే మొగ్గారు.

ఈశ్వరన్‌ భారీ శతకం..

సిల్హెట్‌: అభిమన్యు ఈశ్వరన్‌ (157) శతకంతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ 562/9 స్కోరువద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. జయంత్‌ (83), భరత్‌ (77), సౌరభ్‌ (55), సైనీ (50 నాటౌట్‌) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా.. రోజు ముగిసే సమయానికి 49/2 స్కోరుతో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 252 రన్స్‌ చేసింది.

Updated Date - 2022-12-09T00:49:51+05:30 IST