ఆఫీసు పూర్తయ్యాక ఇక బాస్‌ను పట్టించుకోనక్కర్లేదు.. బెల్జియంలో కొత్త రూల్

ABN , First Publish Date - 2022-01-23T02:51:19+05:30 IST

ఉద్యోగుల వెతలు గమనించిన బెల్జియం ప్రభుత్వం వారికి ఊరటనిచ్చే సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం..

ఆఫీసు పూర్తయ్యాక ఇక బాస్‌ను పట్టించుకోనక్కర్లేదు.. బెల్జియంలో కొత్త రూల్

ఇంటర్నెట్ డెస్క్: వర్క్ ఫ్రం హోం దెబ్బకు అనేక దేశాల్లోని ఉద్యోగులు జీవితం తల్లికిందులైపోయింది. నిరంతరం బాస్‌కు అందుబాటులో ఉండాల్సి రావడంతో వ్యక్తిగత వృత్తిగత జీవితాల మధ్య సరిహద్దు చెరిగిపోయే పరిస్థితి నెలకొంది. అనేక మందిలో అసహనం పతాకస్థాయికి చేరుకుంది. అయితే.. ఉద్యోగుల వెతలు గమనించిన బెల్జియం ప్రభుత్వం వారికి ఊరటనిచ్చే సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం..  ఆఫీసులో తమ షిఫ్టులు పూర్తైన తరువాత ఉద్యోగులు ఇకపై బాస్‌లు, పైఅధికారుల సందేశాలకు, ఫోన్లకు స్పందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఉద్యోగులు స్పందించని సందర్భాల్లో యాజమాన్యాలు వారికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించకూడదని స్పష్టం చేసింది. మరోవైపు.. అత్యవసర సందర్భాల్లో ఉద్యోగుల్ని సంప్రదించే వెసులుబాటును యాజమాన్యాలకు కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. అయితే.. ఈ నిబంధన ప్రస్తుతం ప్రభుత్వోద్యోగులకు మాత్రమే పరిమితం. మరి ప్రైవేటు రంగంలోని వారికి కూడా ఇది వర్తిస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. 

Updated Date - 2022-01-23T02:51:19+05:30 IST