న్యూజెర్సీలో NV Ramana కోసం ఎన్నారైల 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం

ABN , First Publish Date - 2022-06-25T18:21:19+05:30 IST

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణను ప్రముఖ ప్రవాస తెలుగు సంఘాలన్నీ ఏకమై ఘనంగా సన్మానించాయి.

న్యూజెర్సీలో NV Ramana కోసం ఎన్నారైల 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం

న్యూజెర్సీ: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణను ప్రముఖ ప్రవాస తెలుగు సంఘాలన్నీ ఏకమై ఘనంగా సన్మానించాయి. శుక్రవారం(జూన్ 24న) రాత్రి 8.00 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఎడిసన్ నగరంలోని మిరాజ్ బాంక్వెట్ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 'మీట్ అండ్ గ్రీట్' పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలుగు ప్రవాసులు హాజరయ్యారు. అన్ని తెలుగు సంఘాలు ఒకే వేదిక మీద నుంచి తెలుగు జాతి ముద్దుబిడ్డ నూతలపాటి వెంకట రమణను సన్మానించడం ద్వారా 'మీట్ అండ్ గ్రీట్' అనేది అరుదైన కార్యక్రమంగా నిలిచిపోయింది. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తెలుగు ప్రజల్లో తానూ ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నట్లు చెప్పారు. మాతృభాషలోనే చదివి తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు.  




Updated Date - 2022-06-25T18:21:19+05:30 IST