NRI విద్యార్థులను ఉద్దేశించి ముంబై యూనివర్సిటీ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2022-03-14T18:25:32+05:30 IST
ముంబై యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది. 2022-23 ఏడాదికి యూనివర్సిటీ, అనుబంధ కాలేజీల్లోని యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఎన్నారై, ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా), విదేశీ విద్యార్థుల నుంచి
ఎన్నారై డెస్క్: ముంబై యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది. 2022-23 ఏడాదికి యూనివర్సిటీ, అనుబంధ కాలేజీల్లోని యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఎన్నారై, ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా), విదేశీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సర్కిలర్ ద్వారా వెల్లడించింది. ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ఏ పద్ధతిలో అయినా విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జూలై 31.. ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం mu.admissiondesk.org వెబ్సైట్ను సందర్శించొచ్చని వెల్లడించింది.