NRI కుటుంబానికి దారుణ అనుభవం.. గుర్తు తెలియని వ్యక్తులు వారిని గన్నుతో బెదిరించి..

ABN , First Publish Date - 2022-01-12T00:32:15+05:30 IST

భారత్‌కు వచ్చిన ఎన్నారై కుటుంబానికి దారుణం అనుభవం ఎదురైంది. ముగ్గురు గుర్తు తెలియన వ్యక్తులు వారిని గున్నుతో బెదిరించి నగలు డబ్బు దోచుకుపోయారు. పంజాబ్‌లోని పగ్వారా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితులు హర్విందర్ సింగ్, ఆయన సతీమణి సురీందర్ కౌర్, సమీప బంధువు కమల్జీత్ కౌర్ అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవలే వారు..

NRI కుటుంబానికి దారుణ అనుభవం.. గుర్తు తెలియని వ్యక్తులు వారిని గన్నుతో బెదిరించి..

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు వచ్చిన ఎన్నారై కుటుంబానికి దారుణం అనుభవం ఎదురైంది. ముగ్గురు గుర్తు తెలియన వ్యక్తులు వారిని గున్నుతో బెదిరించి నగలు డబ్బు దోచుకుపోయారు. పంజాబ్‌లోని పగ్వారా జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. బాధితులు హర్విందర్ సింగ్, ఆయన సతీమణి సురీందర్ కౌర్, సమీప బంధువు కమల్జీత్ కౌర్ అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవలే వారు తమ సొంత గ్రామం మహేరూకు వచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి వారిని బెదిరించి రూ.28.5 లక్షల విలువైన నగలు, లక్ష రూపాయల నగదును దోచుకుపోయారు. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మొత్తం నాలుగు పోలీసు బృందాలు నిందితుల ఆచూకీ వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాయని జిల్లా డీఎస్‌పీ తెలిపారు. 

Updated Date - 2022-01-12T00:32:15+05:30 IST