Kuwait: కువైత్లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. రేపే ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో..
ABN , First Publish Date - 2022-07-26T19:10:40+05:30 IST
కువైత్ (Kuwait)లోని భారత ఎంబసీ (Indian Embassy) రేపు (బుధవారం) ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

కువైత్ సిటీ: కువైత్ (Kuwait)లోని భారత ఎంబసీ (Indian Embassy) రేపు (బుధవారం) ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రాయబార కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల(కువైత్ కాలమానం ప్రకారం) వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కువైత్లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్లో పాల్గొనడానికి ఆహ్వానితులే. అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్ఫారమ్లో నిర్వహించడం లేదని ఈ సందర్భంగా ఎంబసీ స్పష్టం చేసింది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా ఎంబసీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎంబసీ వద్ద ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు వీలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్పోర్టు నం., సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైత్లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన amboff.kuwait@mea.gov.in కు ఈ-మెయిల్ చేయాలి.