ATA: ఇండియా డే పరేడ్లో పాల్గొన్న 'ఆటా'
ABN , First Publish Date - 2022-08-30T13:12:49+05:30 IST
"ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్లో నిర్వహించిన ఇండియా డే పరేడ్లో అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ATA) పాల్గొంది.
న్యూయార్క్: "ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్లో నిర్వహించిన ఇండియా డే పరేడ్లో అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ATA) పాల్గొంది. న్యూయార్క్లో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని గౌరవిస్తూ జరిగిన ఇండియా డే పెరేడ్లో ఆటా పాల్గొనడం జరిగింది. ఈ ఇండియా డే పరేడ్లో యావత్ భారత్ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో కలిసి హాజరయ్యారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ రెడ్డి బుజాల ముందు ఉండి నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ఆటా) తరపున భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విశేష జనాధరణ పొందిన ‘పుష్ప’ పిక్చర్ లోని ‘తగ్గేదేలే’ డైలాగ్ అలానే ఫోజ్ పెట్టడం విశేషం అని తెలిపారు.
ఆటా న్యూజెర్సీ ప్రాంతీయ సమన్వయకర్త సంతోష్ రెడ్డి కోరం, జంబుల విలాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో దోహద పడింది. ఆటా తరుపున పెద్ద రథ వాహనాన్ని( ఫ్లోట్) పెట్టి , ఆటా చేస్తున్న తెలుగు కమ్యూనిటీ, ఇతర సేవా కార్యక్రమాలను వాహనంపై చూపించడం జరిగింది. మన సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు ధరించి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు ఇషాని రెడ్డి, రిషిత జంబుల, అయాన్ రెడ్డి తుమ్మల, మాన్వి మైకా, ఇతర పిల్లలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అలాగే పోతు రాజు, డప్పు కళాకారులను సంతోష్ రెడ్డి కోరం ఏర్పాటు చేయగా అందరూ అభినందించారు. అలాగే ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ రెడ్డి బుజాల, శరత్ వేముల, ఆటా మాజీ ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, రఘువీర్ రెడ్డి, పరశురామ్ పిన్నపురెడ్డి, సుధాకర్ పెర్కారి, విజయ్ కుందూరు, శ్రీనివాస్ దార్గులా, మహేందర్ ముసుకు, వినోద్ కోడూరు, రాజ్ చిలుముల, సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్ట, జంబుల విలాస్ రెడ్డి కార్యక్రమం జయప్రదం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆటా సభ్యులు శరత్ వేముల మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా ఆటా తరుపున పాల్గొనడం సంతోషముగా ఉందన్నారు.
ఆటా మాజీ ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, పరశురామ్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, ఫిలడెల్ఫియా, డెలావేర్, మన్హట్టన్లల్లో నివసించే భారతీయులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు ఈ పరేడ్కి ఐదు లక్షలు మందికి పైగా భారతీయలు వచ్చి భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తమ్ముకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత భారీ స్థాయిలో న్యూయర్క్ డే పరేడ్కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్ ప్రతినిధులు అభివర్ణించారు. శ్రీనివాస్ దార్గులా, విజయ్ కుందూరు,రాజ్ చిలుముల మాట్లాడుతూ ఈ పరేడ్ గిన్నెస్ వరల్డ్ రికార్డు ఎక్కడం అన్నది భారత ప్రజలకు చాలా సంతోషం అన్నారు. సంతోష్ రెడ్డి కోరం మాట్లాడుతూ ఈ పెరేడ్లో అమెరికా ప్రజలు కూడా ఆనందంగా పాల్గొని ఇండియా పరేడ్ను విజయవంతం చేశారు. ఈ పరేడ్లో భాగంగా వందలాది కమ్యూనిటీ సంస్థలు పాల్గొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శకటాల ప్రదర్శన జరిగింది అని తెలిపారు. మీడియా మిత్రులకు ఆటా మీడియా చైర్ భాను స్వర్గం కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా "భారత్ మాతాకీ జై ", "వందే మాతరం", "జై హింద్", "జై జవాన్ -జై కిసాన్" నినాదాలతో రామ్ వేముల, లక్ష్మణ్ రెడ్డి అనుగు, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, వంశీ యంజాల, ప్రొఫెసర్. రాజశేఖర్ వంగపటి, శ్రీధర్ నాగిరెడ్డి, వేణు నక్షత్రం, నందిని దర్గుల, అనురాధ చీములా, వాణి అనుగు, మహేందర్ ముసుకు, వినోద్ కోడూరు, రఘు రెడ్డి, సుధాకర్ పెర్కారి, ప్రదీప్ కట్ట, జంబుల విలాస్ రెడ్డి న్యూయార్క్ విధుల్లో ప్రజలను ఆకట్టుకున్నారు.
పరేడ్ను వీక్షిండానికి వచ్చిన ప్రవాస భారతీయులు మరియు న్యూయార్క్ ప్రజలు నినాదాలు చేశారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్క సందర్భాన్ని ఫొటోల్లో భద్రపరచిన సంతోష్ రెడ్డి కోరం, డిస్క్ జాకీగా వ్యవహరించిన దివ్యకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆటా నిర్వాహక సంఘం తరుపున సంతోష్ రెడ్డి కోరం కృతజ్ఞతలు తెలిపారు.