తమన్నా మెరుపు రహస్యమిదే!
ABN , First Publish Date - 2022-12-07T23:19:40+05:30 IST
మిల్క్ బ్యూటీ తమన్నాకు చర్మం ఎప్పుడు చూసిన మెరుస్తూ ఉంటుంది. ఈ మెరుపు వెనకున్న రహస్యాన్ని తమన్నా ఇటీవలే ఒక అంతర్జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
మిల్క్ బ్యూటీ తమన్నాకు చర్మం ఎప్పుడు చూసిన మెరుస్తూ ఉంటుంది. ఈ మెరుపు వెనకున్న రహస్యాన్ని తమన్నా ఇటీవలే ఒక అంతర్జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో చూద్దాం..
‘‘గతంలో నేను కెమికల్స్తో చేసిన సౌందర్యసాధనాలు వాడేదాన్ని. కానీ వాటి వల్ల లాభం కన్నా దీర్ఘకాలంలో నష్టమే ఎక్కువుంటుందని తేలింది. దీనితో సహజసిద్ధమైన ఆర్గానిక్ సౌందర్యసాధనాలనే వాడుతున్నా. ఉదాహరణకు మొహం కడుక్కొనేందుకు వాడే స్క్రబ్ను నేనే తయారుచేసుకుంటా. చందనం పొడి, కాఫీ పొడి, కొద్దిగా తేనే వేస్తే ఈ మిశ్రమం తయారవుతుంది. పొడి చర్మం ఉన్నవారు కొద్దిగా తేనె ఎక్కువగా కలపాలి. ఇలా తయారయిన మిశ్రమాన్ని మొహం అంతా రాసి మసాజ్ చేసుకోవాలి. కళ్లకు ఈ మిశ్రమం తగలకుండా చూసుకోవాలి. ఈ మిశ్రమం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు కూడా తొలగిపోతాయి.
శనగపిండి..
చిన్నప్పుడు నా చర్మం చాలా మృదువుగా ఉండేది. ఎండ తగిలితే పొక్కులు వచ్చేవి. అప్పుడు నాకు శనగపిండి..పెరుగును కలిసిన మిశ్రమాన్ని పట్టించేవారు. దీని వల్ల పొక్కులు తగ్గిపోవేవి. ఈ మిశ్రమంలో బాగా చల్లగా ఉన్న పెరుగును వాడితే చాలా మంచి ఫలితాలుంటాయి. అంతే కాకుండా చర్మంపై ఉన్న మృతకణాలు పోవాలంటే- ఈ మిశ్రమాన్ని గట్టిగా కలుపుకోవాలి. మెరుస్తూ ఉండాలంటే తక్కువ పెరుగును ఉపయోగించాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించే 10 నిమిషాల ముందు వేడినీటితో కడగాలి. దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపితే మంచి ఫలితాలుంటాయి. రోజ్వాటర్ బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు..’’