భగవద్గీతకు శాస్త్ర విశ్లేషణ
ABN , First Publish Date - 2022-07-08T08:41:19+05:30 IST
‘‘భగవద్గీతా కించితధీతా’’ అంటారు ఆది శంకరులు. భగవద్గీతను కాస్త చదివినా ధన్యులవుతారనేది ఈ వాక్య తాత్పర్యం.
‘‘భగవద్గీతా కించితధీతా’’ అంటారు ఆది శంకరులు. భగవద్గీతను కాస్త చదివినా ధన్యులవుతారనేది ఈ వాక్య తాత్పర్యం. జగద్గురువైన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధభూమిలో రాబోయే కలియుగానికి లౌకిక, పారలౌకిక, పారమార్థిక, దిశానిర్దేశకంగా చెప్పినదే భగవద్గీత. 16 అధ్యాయాలు... 700 శ్లోకాలున్న ఈ భగవద్గీతకు కొన్ని వేల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. గీతాసారాన్ని తనదైన రీతిలో విస్తృతప్రచారం చేసిన వారిలో దత్తపీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానంద స్వామిజీ ఒకరు. భగవద్గీతలోని శ్లోకాలలో ఒక దానికి.. మరొక దానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే విధంగా శ్రీ స్వామి చేసిన స్వరప్రస్తార వ్యాఖ్యే - ‘‘శ్రీ భగవద్గీత- గీతాస్వరప్రస్తార వ్యాఖ్య’’. 2100 పేజీల (మూడు భాగాలు) సవిస్తారమైన ఈ గ్రంఽథంలో వివిధ శ్లోకాల అంతరార్థం, ప్రామాణికమైన శాస్త్ర విశ్లేషణ కనిపిస్తాయి. గ్రంథానికి అనుబంధంగా ఇచ్చిన పదకోశం- భగవద్గీతపై పరిశోధన చేసేవారికి, దాన్ని కంఠస్థం చేసేవారికి ఎంతో ఉపకరిస్తుంది.
-శ్రీ మద్భగవద్గీత- గీతాస్వరప్రస్తారవ్యాఖ్య
-వ్యాఖ్యానకారులు: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ
-రచన: కుప్పా వేంకటకృష్ణమూర్తి
-ప్రచురణ: రాగరాగిణి ట్రస్టు, అవధూత దత్తపీఠం
-ప్రతులకు: 9849033039