Sedition law: సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చిన కేంద్రం

ABN , First Publish Date - 2022-10-31T18:32:47+05:30 IST

న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఐపీసీలోని సెక్షన్ 124 (ఎ) కింద దేశద్రోహం చట్టంలో మార్పులు తేవాలని అనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు కు కేంద్రం సోమవారం తెలియజేసింది. దేశద్రోహం చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

Sedition law: సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఐపీసీలోని సెక్షన్ 124 (ఎ) కింద దేశద్రోహం చట్టం (Sedition law)లో మార్పులు తేవాలని అనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు (Supreme court)కు కేంద్రం (Center) సోమవారం తెలియజేసింది. దేశద్రోహం చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. వీటిలో కొన్ని పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. దీనిపై కేంద్రం తాజాగా వివరణ ఇవ్వడంతో తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి రెండో వారానికి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ఉదయ్ ఉమేష్ లలిత్ వాయిదా వేశారు.

కాగా, గత మేలో సుప్రీంకోర్టు దీనిపై కేంద్రానికి ఆదేశాలిస్తూ, దేశద్రోహం చట్టంపై కేంద్రం సమీక్ష పూర్తయ్యేంతవరకూ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. అప్పటివరకూ సెక్షన్ 124 ఎ కింద కేసులు నమోదు చేయవద్దని ఇటీవల పదవీ విరమణ చేసిన సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని జస్టిస్ సూర్యకాంత్, హిమా కోహ్లితో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. జైలులో ఉన్న వారు బెయిలు కోసం కోర్టులకు వెళ్లవచ్చని తెలిపింది. ఇక ముందు కేసులు రిజిస్టర్ చేస్తే సంబంధింత పార్టీలు కోర్టును అశ్రయించవచ్చని, వాటిని కోర్టును సాధ్యమైనంత త్వరగా డిస్పో్జ్ చేయాలని పేర్కొంది. సెక్షన్ 124ఎ లోని నిబంధనలను పునఃపరిశీలించేందుకు కేంద్రానికి ధర్మాసనం అనుమతిస్తూ, రీ-ఎగ్జామినేషన్ పూర్తయ్యేంత వరకూ చట్టంలోని నిబంధనలను వర్తింపజేయడం సరికాదని స్పష్టం చేసింది.

Updated Date - 2022-10-31T18:32:49+05:30 IST