Maharashtra: ఊరేగింపుపై దూసుకెళ్లిన కారు...ఏడుగురు యాత్రికుల మృతి

ABN , First Publish Date - 2022-11-01T06:34:03+05:30 IST

వేగంగా వచ్చిన కారు(speeding car) యాత్రికుల( piligrims) ఊరేగింపుపై దూసుకు వెళ్లడంతో ఏడుగురు మరణించిన ఘటన మహారాష్ట్రలోని(Maharashtra) షోలాపూర్ జిల్లా సాంగోలి పట్టణంలో జరిగింది.

Maharashtra: ఊరేగింపుపై దూసుకెళ్లిన కారు...ఏడుగురు యాత్రికుల మృతి
7-pilgrims-dead-as-speeding

షోలాపూర్ (మహారాష్ట్ర): వేగంగా వచ్చిన కారు(speeding car) యాత్రికుల( piligrims) ఊరేగింపుపై దూసుకు వెళ్లడంతో ఏడుగురు మరణించిన ఘటన మహారాష్ట్రలోని(Maharashtra) షోలాపూర్ జిల్లా సాంగోలి పట్టణంలో జరిగింది. యాత్రికులు కొల్హాపూర్ నుంచి పంధార్ పూర్ కు ఊరేగింపుగా వెళుతుండగా ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. గాయపడిన యాత్రికులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం షిండే అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-11-01T06:34:05+05:30 IST