MCD Elections 2022: సిసోడియా కంచుకోటలో ఆప్‌‌కు బీజేపీ షాక్..

ABN , First Publish Date - 2022-12-07T16:30:04+05:30 IST

ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసినప్పటికీ, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి గట్టి పట్టున్న..

MCD Elections 2022: సిసోడియా కంచుకోటలో ఆప్‌‌కు బీజేపీ షాక్..

న్యూఢిల్లీ: ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విజయకేతనం ఎగురవేసినప్పటికీ, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి (Manish Sisodia) గట్టి పట్టున్న ప్రతాప్ గంజ్‌ నియోజకవర్గంలో ఆ పార్టీకి కమలనాథులు షాక్ ఇచ్చారు. ప్రతాప్ నగర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 4 వార్డుల్లో 3 వార్డులను బీజేపీ గెలుచుకుంది. ఒక వార్డు మాత్రమే ఆప్‌కు దక్కింది. ప్రతాప్‌గంజ్ నియోజకవర్గంలోని ప్రతాప్ గంజ్, మాండవ్లి, వినోద్ నగర్‌లను బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. మయూర్ విహార్ ఫేజ్-2లో ఆప్ అభ్యర్థి గెలుపొందారు.

విజేతలు వీరే..

ప్రతాప్ గంజ్ నుంచి బేజీపీ అభ్యర్థి రేణు చౌదరి, మాండవ్లి నుంచి ఆ పార్టీకే చెందిన శశి చందన, వినోద్ నగర్ నుంచి రాజేంద్ర సింగ్ నెగి గెలుపొందారు. మయూర్ విహార్ ఫేజ్-2 వార్డును ఆప్ అభ్యర్థి దేవేంద్ర కుమార్ కైవసం చేసుకున్నారు.

Updated Date - 2022-12-07T16:30:06+05:30 IST