సుచిరిండియా 29వ జాతీయ, రాష్ట్ర యంగ్ జీనియస్ అవార్డ్స్

ABN , First Publish Date - 2022-04-13T23:26:35+05:30 IST

సర్ C.V రామన్ టాలెంట్ టెస్ట్ లో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం విద్యావికాస్ హైస్కూల్‌ 6వ తరగతి విద్యార్థిని గెడా వాసవి శ్రీసాయి ఫస్ట్ ర్యాంక్ సాధించింది.

సుచిరిండియా 29వ జాతీయ, రాష్ట్ర యంగ్ జీనియస్ అవార్డ్స్

ఆంధ్రజ్యోతి: సర్ C.V రామన్ టాలెంట్ టెస్ట్ లో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం విద్యావికాస్ హైస్కూల్‌ 6వ తరగతి  విద్యార్థిని గెడా వాసవి శ్రీసాయి ఫస్ట్  ర్యాంక్ సాధించింది. ఈ కార్యక్రమం సుచిరిండియా ఫౌండర్ డాక్టర్ కిరణ్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ముఖ్య అతిథిగా నటకిరీటి హీరో రాజేంద్రప్రసాద్ గారు హాజరై విద్యార్థులకు అవార్డులు అందించారు. ఈ విషయం తెలుసుకుని జంగారెడ్డిగూడెం స్థానిక రిటైర్డ్ గ్రంధాలయ అధికారి గద్దే సత్యనారాయణ, శ్రీప్రతిభ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సి.యం రాజు, మాజీ గ్రంధాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాసాని ప్రసాద్, నాట్యమయూరి రూపాదేవి, అడ్వకేట్ మట్టా శ్రీను కలిసి గెడా వాసవి శ్రీ సాయి ఇంటికి వెళ్లి ఆమెను ఆశీర్వదించి పూలమాలలు వేసి సత్కరించారు. అనతరం వారు మాట్లాడుతూ వాసవి భవిష్యత్తులో మరింత బాగా చదివి ఉన్నత శిఖరాలకు వెళ్లాలని జంగారెడ్డిగూడెం పట్టణానికి మరింత పేరు తీసుకురావాలని అన్నారు.



Updated Date - 2022-04-13T23:26:35+05:30 IST