సర్కారు బడుల్లో సౌకర్యాల కోసం విద్యాంజలి
ABN , First Publish Date - 2022-01-16T01:57:03+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దాతల ద్వారా ప్రభుత్వం సమకూర్చనుంది. అందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో
డిసెంబరు 30తో ముగిసిన నమోదు
గడువు రిజిస్ట్రేషన్లో నల్లగొండ వెనుకంజ
నల్లగొండ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దాతల ద్వారా ప్రభుత్వం సమకూర్చనుంది. అందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన విద్యాంజలి వెబ్సైట్లో పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2021, డిసెంబరు 30న దీని గడువు ముగిసింది. కాగా, రిజిస్ట్రేషన్ వి షయంలో సూర్యాపేట జిల్లా 75.55శాతంతో ముందుండగా, యాదాద్రి 72.17శాతంతో రెండో స్థానంలో నిలిచింది. కాగా,55శాతంతో రిజిస్ట్రేషన్ విషయంలో నల్లగొండ వెనుకబడింది.