ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటుకు త్వరలో జీవో

ABN , First Publish Date - 2022-01-06T23:01:52+05:30 IST

జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఆంధ్రకేపరి యూనివర్సిటీ ఏర్పాటు కు ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చే యనుందని యూనివర్సిటీ ఓఎస్‌డీ డాక్టర్‌ కేవీ ఎన్‌.రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటుకు త్వరలో జీవో

ఓఎస్‌డీ కేవీఎన్‌రాజు 


ఒంగోలు విద్య, జనవరి 5 : జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఆంధ్రకేపరి యూనివర్సిటీ ఏర్పాటు కు ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చే యనుందని యూనివర్సిటీ ఓఎస్‌డీ డాక్టర్‌ కేవీ ఎన్‌.రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి ఇ ప్పటికే రాష్ట్ర మంత్రి వర్గం అసెంబ్లీ కౌన్సిల్‌లో ఆమోదం పొంది గెజిట్‌ కూడా విడుదలైంది. యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్త ర్వులు ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభమవు తాయని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ ఏ ర్పాటుతో కొత్తగా వచ్చినవి, పాతకోర్సులతో కలి పి 26 కోర్సులు అందుబాటులోకి రానున్నాయ న్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.350కోట్లు కేటాయించగా తొలి విడతగా రూ.200 కోట్లు వి డుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలి పిందని పేర్కొన్నారు. సిబ్బంది జీతాలు చెల్లింపు నకు సంబంధించి సంత్సరానికి రూ.38కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు ఓఎస్‌డీ వెల్లడించా రు. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని పేర్నమి ట్టలో ఉన్న 109 ఎకరాల్లో నాలుగు సంవత్సరా లలో పూర్తి స్థాయి యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని తెలిపా రు. కొద్ది రోజులలో యూనివర్సిటీ ప్రజలకు అం దుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-06T23:01:52+05:30 IST