రైతునేస్తం మిద్దెతోట పురస్కారాలు
ABN , First Publish Date - 2022-12-31T01:00:18+05:30 IST
రెండు తెలుగు రాష్ట్రాలలో మిద్దెతోటలు చేస్తున్న కొందరికి ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి’ పేరుతో,...
రెండు తెలుగు రాష్ట్రాలలో మిద్దెతోటలు చేస్తున్న కొందరికి ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి’ పేరుతో, రైతునేస్తం ఫౌండేషన్ వారు నేటి ఉదయం పది గంటలకు మిద్దెతోట పురస్కారాలు ఇచ్చి, సత్కరించబోతున్నారు. హైదరాబాద్ లక్డికాపూల్లోని రెడ్హిల్స్లో గల ‘సూరాన’ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఎం. హన్మంతరావు (డైరెక్టర్, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ), విశిష్ట అతిథిగా సుశీల చింతల (చీఫ్ జనరల్ మేనేజర్-, నాబార్డ్, తెలంగాణ), గౌరవ అతిథిగా ఆచార్య అడపా కిరణ్ (డీన్, డైరెకర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం), ఆత్మీయ అతిథిగా ప్రముఖ మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి పాల్గొంటారు.
-– డా. పుల్లూరి సంపత్ రావు