వైస్‌ ఛైర్మన్‌ అభ్యర్థిని కిడ్నాప్‌

ABN , First Publish Date - 2022-03-05T16:22:45+05:30 IST

తిరువళ్లూర్‌ జిల్లా చోళవరం యూనియన్‌ ఆరణి నగర పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందారు. నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన

వైస్‌ ఛైర్మన్‌ అభ్యర్థిని కిడ్నాప్‌

                                  - ఆరణిలో ఉద్రిక్తత


గుమ్మిడిపూండి(చెన్నై): తిరువళ్లూర్‌ జిల్లా చోళవరం యూనియన్‌ ఆరణి నగర పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందారు. నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్‌గా రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా 3వ వార్డు నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి ప్రభావతి నామినేషన్‌ వేశారు.. మధ్యాహ్నం జరగాల్సిన ఈ ఎన్నిక కోసం ఆమె కార్యాలయం ముందు నిలబడి ఉండగా, కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఊహించని ఈ పరిణామానికి దిగ్ర్భాంతి చెందిన ఆమె కుటుంసభ్యులు, బంధువులు పంచాయతీ కార్యాలయం ముందు భైఠాయించి ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన పోలీసులు కౌన్సిలర్‌ ప్రభావతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీయగా, భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2022-03-05T16:22:45+05:30 IST