తిరుచ్చి వద్ద మూడు కార్లు ఢీ

ABN , First Publish Date - 2022-10-27T08:51:58+05:30 IST

తిరుచ్చి సమీపంలో మూడు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు.

తిరుచ్చి వద్ద మూడు కార్లు ఢీ

- నలుగురు మహిళల దుర్మరణం

పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 26: తిరుచ్చి సమీపంలో మూడు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా... తిరుచ్చి-మదురై జాతీయ రహదారి తువరకుర్చి సమీపంలో మదురై నుంచి తిరుచ్చి వైపు వస్తున్న కారు టైరు హఠాత్తుగా పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొంది. ఈ ఘటనతో కారులో వున్న నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అదే విధంగా కారులో చిక్కుకున్న ముగ్గురు చిన్నారులను బయటకు తీసి ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఇదిలా వుండగా మృతులను తిరుచ్చికి చెందిన మంగై అరసి (64), పూజ (20), పద్మ (20), రంజనగా గుర్తించిన పోలీసులు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-10-27T08:52:03+05:30 IST