కన్నడ పతాకానికి నిప్పు
ABN , First Publish Date - 2022-12-07T11:07:08+05:30 IST
కన్నడ పతాకానికి నిప్పు అంటించిన ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్(Software Engineer) అ
- వారణాసి టెకీ అరెస్టు
బెంగళూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కన్నడ పతాకానికి నిప్పు అంటించిన ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్(Software Engineer) అమృతేశ్ (30)ను హెచ్ఎస్ఆర్ లే అవుట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే అమృతేశ్ ఈనెల 4న పరంగిపాళ్యలో రాత్రి 10 గంటలవేళ ఏ కారణంతోనో కర్ణాటక పతాకానికి నిప్పంటించాడు. ఈ మేరకు స్థానిక కన్నడ సంఘం నాయకుడు నవీన్ నరసింహ చేసిన ఫిర్యాదు మేరకు అమృతేశ్ను అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఢిల్లీలో ఐఐటీ చదివిన అమృతేశ్ తివారి రెండు నెలలుగా బెంగళూరులో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.