జన్మదినం రోజునే తల్లికి కడుపుకోత
ABN , First Publish Date - 2022-03-06T16:21:00+05:30 IST
కుమారుడు, అతడి స్నేహితులతో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆ తల్లికి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. స్నానానికి వెళ్లిన కుమారుడు నీట మునిగి మరణించాడనే వార్త విని ఆమె కుప్ప
- క్వారీ నీటిలో మునిగి విద్యార్థుల మృతి
అడయార్(చెన్నై): కుమారుడు, అతడి స్నేహితులతో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆ తల్లికి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. స్నానానికి వెళ్లిన కుమారుడు నీట మునిగి మరణించాడనే వార్త విని ఆమె కుప్ప కూలిపోయింది. వివరాలిలా.. స్థానిక పల్లావరంలో రాళ్ళక్వారీలో నిల్వవున్న నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మరణించారు. పొళిచ్చలూరుకు చెందిన మునిలోకేష్ (17) అనే విద్యార్థి పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం తన తల్లి పుట్టినరోజు కావడంతో తన స్నేహితులైన పొళిచ్చలూరుకు చెందిన యుగేష్ (17), ఆకాష్, దక్షిణా మూర్తి, విశ్వ, హరి ప్రకాష్ తదితర స్నేహితులను ఇంటికి పిలిచి తల్లితో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఆ తర్వాత పల్లావరంలోని రాళ్ళక్వారీలో స్నానానికి వెళ్లారు. అయితే, యుగేష్, మునిలోకేష్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో రెండు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.