ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా.. నెలనెలా రూ.200డిపాజిట్ చేస్తే.. ఏటా రూ.72వేలు పొందొచ్చు!

ABN , First Publish Date - 2022-11-24T12:42:20+05:30 IST

సాధారణ మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2019లో ఓ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దాని పేరే ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్‌ ధన్ యోజన(PM-SYM). ఈ స్కీమ్ ద్వారా శ్రామిక వర్గాలకు చెందిన ప్రజలు..

ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా.. నెలనెలా రూ.200డిపాజిట్ చేస్తే.. ఏటా రూ.72వేలు పొందొచ్చు!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఏ ప్రైవేటు రంగ సంస్థల్లో పని చేస్తున్న వారికైనా పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఉన్నాయి. పీఎఫ్ ఖాతాలో జమైన డబ్బు.. ఉద్యోగ విరమణ తర్వాత చేతికందుతుంది. అలాగే సదరు ఉద్యోగికి నెల నెలా పెన్షన్ కూడా వస్తుంది. కానీ ఇళ్లలో పాచి పని, వీధుల్లో వ్యాపారం, రోజూ వారి కూలీలకు ఇటువంటి సౌకర్యం లేదు. ఈ క్రమంలోనే పైన పేర్కొన్న సాధారణ మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2019లో ఓ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దాని పేరే ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్‌ ధన్ యోజన(PM-SYM). ఈ స్కీమ్ ద్వారా శ్రామిక వర్గాలకు చెందిన ప్రజలు.. వృద్ధాప్య దశలో వచ్చే ఆర్థిక ఇబ్బందులను కొంత వరకు అదిగమించవచ్చు.

దంపతులు ఈ స్కీమ్‌లో చేరి ప్రతి నెల రూ.200 (భార్యభర్తలు చెరో రూ.100)చొప్పున ఏడాదికి రూ.2400 డిపాజిట్ చేయడం ద్వారా 60ఏళ్ల వయసులో భార్యభర్తలు ఏటా రూ.72వేలు పెన్షన్ రూపంలో పొందొచ్చు. ఉదహరణకు 30ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఈ స్కీమ్‌లో చేరి.. నెల నెలా భార్యాభర్తలు ఇద్దరూ రూ.200 డిపాజిట్ చేశారు అనుకుందాం. 60ఏళ్ల వయసులో ఆ భార్యాభర్తలకు నెల నెలా రూ.6వేల(ఒక్కరికి రూ.3000 లెక్కన) పెన్షన్ లభిస్తుందన్నమాట. పెన్షన్ పొందుతున్న సమయంలో ఒకవేళ చందాదారుడు మరణిస్తే.. అతడికి అందుతున్న పెన్షన్‌లో దాదాపు 50శాతం డబ్బులు కుటుంబ పెన్షన్‌గా లబ్ధిదారుడి భాగస్వామికి అందుతాయి.

ఈ స్కీమ్‌లో చేరాలంటే చందాదారుడి వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ కచ్చితంగా కలిగి ఉండాలి. ఔత్సాహికులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా.. తదితర వివరాలతో స్థానికంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్(CSC)ను సందర్శించడం ద్వారా ఈ పథకంలో రిజిస్టర్ కావొచ్చు.

Updated Date - 2022-11-24T13:09:01+05:30 IST