వేతన పెంపు 10%
ABN , First Publish Date - 2022-08-17T06:21:40+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్లోని కంపెనీలు వేతనాలను సగ టున 10 శాతం పెంచవచ్చని అంతర్జాతీయ సంస్థ విల్లీస్ టవర్స్ వాట్సన్ అంచ నా వేసింది.

ఆసియా, పసిఫిక్లోనే అత్యధికం
2022-23పై విల్లీస్ టవర్ వాట్సన్ అంచనా
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్లోని కంపెనీలు వేతనాలను సగ టున 10 శాతం పెంచవచ్చని అంతర్జాతీయ సంస్థ విల్లీస్ టవర్స్ వాట్సన్ అంచ నా వేసింది. ఆసియా పసిఫిక్ దేశాల్లోకెల్లా ఇదే అత్యధికమని తాజా నివేదికలో పేర్కొంది. జీతాల పెంపు చైనాలో 6 శాతం, హాంకాంగ్లో 4 శాతం, సింగపూర్లో 4 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. ఉద్యోగుల వలసలతో ఇబ్బందులు ఎదు రవుతున్న నేపథ్యంలో ప్రతిభావంతులను కాపాడుకునేందుకు భారత్లోని కంపెనీ లు ఈ ఆర్థిక సంవత్సరంలో జీతాలను రెండంకెల స్థాయిలో పెంచవచ్చని విల్లీస్ టవర్స్ వాట్సన్ అభిప్రాయపడింది. 2021-22లో వేతన పెంపు సగటు 9.5 శాతంగా నమోదైందని వెల్లడిం చింది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో 168 దేశాల్లో సర్వే జరిపినట్లు, భారత్లో విభిన్న రంగాలకు చెందిన 590 కంపెనీలను సర్వే చేయడం జరిగిందని విల్లీస్ టవర్స్ వాట్సన్ తెలిపింది.
సర్వేలో పాల్గొన్న 58 శాతం కంపెనీలు గత ఏడాది కంటే అధిక వేతన పెంపునకు బడ్జెట్ కేటాయింపులు జరిపినట్లు తెలుపగా.. 24.4 శాతం కంపెనీలు గత స్థాయిలోనే కేటాయించనున్నట్లు తెలిపాయి. 2021-22 స్థాయి కంటే కేటాయింపులు తగ్గించనున్నట్లు 5.4 శాతం కంపెనీలు వెల్లడించాయి. వచ్చే 12 నెలల్లో వ్యాపార రాబడిపై 42 శాతం కంపెనీలు సానుకూల వైఖరిని వ్యక్తపర్చగా.. 7.2 శాతం కంపెనీలు మాత్రం నిరాశావహంగా ఉన్నాయి.