5 శాతం తగ్గిన సునీల్‌ మిట్టల్‌ వేతనం

ABN , First Publish Date - 2022-07-25T09:32:45+05:30 IST

భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వేతనం 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం మేరకు తగ్గి రూ.15.39 కోట్లకు పడిపోయింది.

5 శాతం తగ్గిన సునీల్‌ మిట్టల్‌ వేతనం

న్యూఢిల్లీ: భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వేతనం 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం మేరకు తగ్గి రూ.15.39 కోట్లకు పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం రూ.16.19 కోట్లు. అలవెన్సులు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, వేతనం కలిపి ఆయన ఆదాయం గత ఏడాది రూ.15.39 కోట్లని కంపెనీ వార్షిక నివేదికలో తెలిపింది. ప్రోత్సాహకాల విలువ తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. 2021-22లో ఆయనకు వచ్చిన ప్రోత్సాహకాల విలువ ముందు ఏడాదితో పోల్చితే రూ.1.62 కోట్ల నుంచి రూ.83 లక్షలకు తగ్గింది. 

Updated Date - 2022-07-25T09:32:45+05:30 IST