సీఏల నిర్వాకంతోనే సత్యం స్కామ్
ABN , First Publish Date - 2022-11-24T03:09:14+05:30 IST
చార్టర్డ్ అకౌంటెంట్లపై (సీఏలు) హెచ్డీఎ్ఫపీ చైర్మన్ దీపక్ పరేఖ్ విరుచుకు పడ్డారు...
న్యూఢిల్లీ : చార్టర్డ్ అకౌంటెంట్లపై (సీఏలు) హెచ్డీఎ్ఫపీ చైర్మన్ దీపక్ పరేఖ్ విరుచుకు పడ్డారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి వీరి వైఫల్యమే కారణమన్నారు. కంపెనీ ఖాతా పుస్తకాల్లో అనేక లోపాలున్నా, ఆ ఖాతాలను ఆడిట్ చేసిన సీఏలు, డూడూ బసవన్నల్లా అప్పటి కంపెనీ చైర్మన్ రామలింగ రాజుకు వంత పాడారని విమర్శించారు. సీఐఐ నిర్వహించిన ఒక పుస్తక ఆవిష్కరణ సమావేశంలో పరేఖ్ ఈ విమర్శలు చేశారు. తాము వాటాదారుల కోసం పనిచేస్తున్నామనే విషయాన్ని ప్రతి కంపెనీ సీఈఓ గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రమోటర్ల దురాశతోనే అనేక కంపెనీల దుకాణాలు మూతపడుతున్నాయన్నారు. ఆ దురాశను నియంత్రించడం ఎవరివల్లా కాదని పరేఖ్ స్పష్టం చేశారు.