సామ్సంగ్ గెలాక్సీ ప్రీమియం ఫోన్ల ప్రీ-బుకింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-17T06:19:52+05:30 IST
భారత మార్కెట్లో ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్4’, ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్4’ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్ను ప్రారంభించినట్లు దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్ దిగ్గజం సామ్సంగ్..
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్4’, ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్4’ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్ను ప్రారంభించినట్లు దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్ దిగ్గజం సామ్సంగ్ ప్రకటించింది. ఆన్లైన్తోపాటు దేశవ్యాప్తంగా కంపెనీ రిటైల్ కేంద్రాల ద్వారా ఈ ఫోన్ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్ల టాప్ ఎండ్ మోడల్ ధర రూ.1.85 లక్షల స్థాయిలో ఉంది. అత్యంత ఖరీదైన 5జీ స్మార్ట్ఫోన్ సిరీస్ ఇదే. ప్రపంచ మార్కెట్లో ఫోల్డ్4, ఫ్లిప్4 ఫోన్లను ఫోల్డ్3, ఫ్లిప్3 మోడళ్ల ధర స్థాయిలోనే విక్రయిస్తున్నప్పటికీ, గడిచిన కొన్ని నెలల్లో రూపాయి విలువ భారీగా క్షీణించిన నేపథ్యంలో భారత కస్టమర్లు కాస్త అధిక ధర చెల్లించాల్సి వస్తుందని టెక్ఆర్క్ వ్యవస్థాపకులు, చీఫ్ అనలిస్ట్ ఫైసల్ కవూసా అన్నారు. ఫోల్డ్3, ఫ్లిప్3 మోడళ్లు గత ఏడాదే భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.