యెజ్డీ బండి.. మళ్లీ వచ్చేనండి..
ABN , First Publish Date - 2022-01-14T09:31:34+05:30 IST
యెజ్డీ బండి.. మళ్లీ వచ్చేనండి..
ముంబై : క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ గురువారం యెజ్డీ మోటార్ సైకిల్ను తిరిగి మార్కెట్లో విడుదల చేసింది. మొత్తం మూడు మోడల్స్ను ప్రవేశపెట్టింది. వీటిలో రోడ్స్టర్ ధర రూ.1.98 లక్షలు కాగా స్ర్కాంబ్లర్ ధర రరూ.2.04 లక్షలు, అడ్వెంచర్ ధర రూ.2.09 లక్షలు (ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర). మూడు బైక్లు 334 సీసీ లిక్విడ్ కూల్డ్, ఫ్యుయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్తో వచ్చాయి. దేశవ్యాప్తంగా క్లాసిక్ లెజెండ్స్ షోరూమ్లన్నింటిలోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. రూ.5,000 డిపాజిట్తో ఈ బైక్ల బుకింగ్లను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది.