ముఖేష్ అంబానీ... అతి భారీ ఐపీఓ * త్వరలో జరగనున్న ఆర్ఐఎల్ ఏజీఎంలో ప్రకటన !
ABN , First Publish Date - 2022-04-29T20:45:55+05:30 IST
ప్రపంచ ధనవంతుల్లో ఒకడైన భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ... జియో, రిలయన్స్ రిటైల్ కోసం భారతదేశపు అతిపెద్ద ఐపీఓలను సిద్ధం చేస్తున్నారు.
ముంబై : ప్రపంచ ధనవంతుల్లో ఒకడైన భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ... జియో, రిలయన్స్ రిటైల్ కోసం భారతదేశపు అతిపెద్ద ఐపీఓలను సిద్ధం చేస్తున్నారు. ఈ మెగా ప్లాన్లో... టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ప్లాట్ఫాం(ఆర్జేపీఎల్), అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్) కోసం ప్రత్యేక ప్రారంభ వాటా విక్రయాలు ఉంటాయి. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) ముఖేష్ అంబానీ... ఇందుకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేయవచ్చునని చెబుతున్నారు.
రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కోసం ప్రారంభ పబ్లిక్ ఆఫర్లను(ఐపిఓ) ప్రారంభించేందుకు ముకేశ్ అంబానీ సిద్ధమవుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) చైర్మన్ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేయవచ్చని నివేదిక పేర్కొంది.