‘మౌలికా’నికి మరింత వెసులుబాటు

ABN , First Publish Date - 2022-12-09T01:22:17+05:30 IST

రహదారుల వంటి మౌలిక ప్రాజెక్టుల నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం...

‘మౌలికా’నికి మరింత వెసులుబాటు

19న బీమా ష్యూరిటీ బాండ్స్‌

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: రహదారుల వంటి మౌలిక ప్రాజెక్టుల నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఈ నెల 19న బీమా సదుపాయంతో కూడిన ష్యూరిటీ బాండ్స్‌ జారీ చేయబోతోంది. సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయం వెల్లడించారు. భారత్‌లో ఈ తరహా రుణ పత్రాలు (బాండ్స్‌) జారీ చేయడం ఇదే మొదటిసారి. ఆయా ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టర్లకు కూడా ఈ బాండ్స్‌ పెద్ద భరోసా ఇస్తాయని గడ్కరీ అన్నారు.

ష్యూరిటీ బాండ్స్‌ ప్రత్యేకత: కంపెనీలు జారీ బాండ్స్‌కి.. బీమాతో కూడిన ష్యూరిటీ బాండ్స్‌ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ బాండ్స్‌తో సేకరించిన నిధులతో పూర్తి చేసే ప్రాజెక్టుల పనితీరు, సమయానికి వాటిని పూర్తి చేసేందుకు బీమా ఉంటుంది. కంపెనీలు జారీ చేసే రుణ పత్రాలపై మాత్రం వాటి అసలు+వడ్డీ చెల్లింపులకు మాత్రమే ఆయా కంపెనీలకు బాధ్యత ఉంటుంది. దీనివల్ల తమ వర్కింగ్‌ క్యాపిటల్‌ నిధులు బ్యాంకు హామీల కింద చిక్కుకుపోతాయనే భయం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఉండదు.

Updated Date - 2022-12-09T01:22:24+05:30 IST