సిటీ గ్యాస్ కోసం ఐఓసీ రూ.7,000 కోట్ల పెట్టుబడి
ABN , First Publish Date - 2022-01-17T08:56:22+05:30 IST
సిటీ గ్యాస్ కోసం ఐఓసీ రూ.7,000 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: తమ సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) వ్యవస్థను మరింత విస్తరించాలని ఐఓసీ భావిస్తోంది. ఇందులో భాగంగా అదనంగా మరో రూ..7,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయిం చినట్టు తెలిపింది. ఇటీవల ముగిసిన బిడ్డింగ్లో గుంటూరుతో సహా దేశంలోని తొమ్మిది జిల్లాల్లో సీజీడీ సరఫరా కాంట్రాక్టులు ఐఓసీకి దక్కాయి. ఈ నగరాల్లో సీఎన్జీ స్టేషన్లు, పైపుల ద్వారా సరఫరా చేసే వంట గ్యాస్ కోసం కంపెనీ ఈ మొత్తం ఖర్చు చేయబోతోంది. సీజీడీ కోసం ఐఓసీ ఇప్పటికే నిర్ణయించిన రూ.20,000 కోట్ల పెట్టుబడులకు ఇది అదనం.