అరుణాచల్ ప్రదేశ్లో 3ఎఫ్ పామాయిల్ ప్లాంట్
ABN , First Publish Date - 2022-08-31T09:35:36+05:30 IST
హైదరాబాద్కు చెందిన 3ఎఫ్ పామ్ కంపెనీ ఈశాన్య రాష్ట్రాలకు కార్యకలాపాలను విస్తరించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్కు చెందిన 3ఎఫ్ పామ్ కంపెనీ ఈశాన్య రాష్ట్రాలకు కార్యకలాపాలను విస్తరించింది. రూ.250 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ కోసం 120 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశామని.. సెప్టెంబరు 30 ఫ్యాక్టరీ పనులు ప్రారంభమవుతాయని 3ఎఫ్ ఆయిల్ పామ్ ఎండీ, సీఈఓ సంజయ్ గోయెంకా తెలిపారు. ఈ ప్లాంట్లో పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు వ్యర్థాల ఆధార విద్యుదుత్పత్తి ప్లాంట్ తదితరాలు ఉంటాయి. మొదటి దశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తవుతాయి. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లో 500 మంది రైతులతో దాదాపు 2 వేల హెక్టార్లలో 3ఎఫ్ పామాయిల్ సాగు చేయిస్తోంది.